హైదరాబాద్ : కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 13న నల్గండలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఉద్యమాన్ని ఉద్ధఅతం చేస్తామని ప్రకటించారు. కెఆర్ఎమ్బి పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ కు పోరాటం కొత్త కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ స్పష్టం చేశారు.