ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల పరిధిలోని బందలవాడ బ్రిడ్జి వద్ద బుధవారం ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఎఫ్ ఎస్ టి టీం రవీంద్రనాథ్ రెడ్డి ల ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఎలాంటి ఆధారాలు లేని 2,84,800 రూపాయల డబ్బులను ఇద్దరి నుండి సీజ్ చేశారు. గోపాల్, సాంబశివుడు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా, ఎలాంటి బిల్లులు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఆ డబ్బుకు సంబంధించిన సరైన బిల్లులు ఆధారాలు చూపితే తిరిగి అప్పగిస్తామని చెప్పారు.