హిందూపురం (శ్రీసత్యసాయి) : రాయితీలు పోత్సాహకాలివ్వాలంటూ… శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని రైతులు, రీలర్లు చేపట్టిన సమ్మె మంగళవారంతో 7వ రోజుకు చేరుకుంది. తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పట్టుగూళ్ల మార్కెట్ ఎదురుగా ఉన్న రోడ్డుపై పట్టుగూళ్లసంచులను ఉంచి పట్టు రైతులు, రీలర్లు నిరసన తెలిపారు. పట్టు రైతులు, రీలర్లకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ రూ.67 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు.