ఎపిలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం : మోడికి పవన్‌ లేఖ

అమరావతి : ఎపిలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని, ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ …. ప్రధానమంత్రి మోడికి-జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ లేఖ రాశారు. లేఖలో …. ” వైసిపి పాలనలో భూసేకరణ పేరిట రూ.32,141 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తోంది. సీబీఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు తెలుస్తాయి. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86,984 మందికే ఇచ్చారు ” అని పవన్‌ పేర్కొన్నారు.

➡️