ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి : సిపిఎం

ప్రజాశక్తి-విజయవాడ : సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంట్రాక్టు డ అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 16 రోజులుగా సమ్మె చేస్తుంటే, సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకుండా వారిని నిందించే విధంగా మాట్లాడడం గర్హనీయమన్నారు. అలాగే మహిళా ఉగ్యోగుల పట్ల అవమానిస్తూ వ్యాఖ్యానించిన వ్యక్తి ఆ పదవికి అనర్హుడని.. అతనిపై తక్షణం చట్టపరమైన, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️