పంజాగుట్ట పిఎస్ మొత్తం సిబ్బందిపై వేటు.. సీపీ సంచలన నిర్ణయం

Jan 31,2024 12:49 #Panjagutta, #police, #transfers

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ మొదలు.. హోంగార్డ్‌ వరకు సిబ్బందిని బదిలీ చేశారు. 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియామకం జరిగింది. కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం.. ప్రజా భవన్‌లోని ప్రభుత్వ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని ఆరోపణలపై బదిలీ వేటు వేసినట్లు సమాచారం.

➡️