భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌పై పిడుగు పాటు.. రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం

Jun 30,2024 10:16 #Bhadradri power plant.., #pidugu

భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌లోని జనరేటింగ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పై పిడుగు పడింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. గమనించిన అధికారులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందజేయగా వారు ఘటనా స్థలానికి చేరకుని మంటలను అదుపు చేశారు. ఈ దుర్ఘటనలో రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 270 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అయితే, యూనిట్‌-1 పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

➡️