రేషన్‌ వ్యాన్‌లపై మాజీ సీఎం జగన్‌ బొమ్మలు తొలగించాలి: ఎమ్మెల్యే మామిడి

Jul 2,2024 08:35 #angry, #MLA Mamidi, #srikakulam

ఎల్‌ఎన్‌పేట: రేషన్‌ సరకులు పంపిణీ చేసే వ్యాన్‌లపై మాజీ సీఎం జగన్‌ బొమ్మలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా, పాటించకపోవడంపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఎన్‌పేట మండలం ఎంబరాం గ్రామంలో సోమవారం పింఛన్ల పంపిణీకి ఎమ్మెల్యే వచ్చారు. అదే సమయంలో జగన్‌ చిత్రంతో కూడిన రేషన్‌ సరకుల వాహనం వచ్చింది. అది చూసిన ఎమ్మెల్యే, కారు దిగి వాహనం వద్దకు వెళ్లారు. దొంగల బమ్మలతో సరకులు ఎలా పంపిణీ చేస్తారని రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహించారు. మీ గ్రామంలో ఇంకా పాత ముఖ్యమంత్రిబొమ్మతో రేషన్‌ అందిస్తుంటే ఏం చేస్తున్నారని టిడిపి నాయకులపై కూడా అసహనం చెందారు. అక్కడి నుంచే మంత్రి అచ్చెన్నాయుడికి ఫోన్‌ చేసి, తహశీల్దారు రాణి అమ్మాజీతో మాట్లాడించారు. ఎండీఎం ఆపరేటర్‌, రేషన్‌ డీలరును తొలగించాలని, రెవెన్యూ సిబ్బందికి మెమోలు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దీనిపై జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామని తహశీల్దారు తెలిపారు.

➡️