ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ

Mar 30,2024 16:11 #high court, #Telangana

హైదరాబాద్‌ : వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ ఆస్తుల వ్యవహారంలో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ వైవీ సుబ్బారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్‌ ఆస్తుల వ్యవహారంలో ఇందూ-హౌసింగ్‌ బోర్డు కేసులో సుబ్బారెడ్డిపై స్పష్టమైన ఆధారాలున్నాయని పేర్కొంది. అంతేకాకుండా ఈ కేసును కింది కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. ఇప్పుడు ఈ కేసును కొట్టివేస్తే కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లు అవుతుందని స్పష్టం చేసింది. అందువల్ల వైవీ పిటిషన్‌ను అనుమతించమని తెలంగాణ హైకోర్టు తీర్పు నిచ్చింది.

➡️