ప్రజాదరణతో సాగుతోన్న సిపిఎం అభ్యర్థి లోతా.రామారావు ప్రచారం

అడ్డతీగల (అల్లూరి) : సిపిఎం అభ్యర్థి లోతా.రామారావు అడ్డతీగల గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజాదరణతో ఈ ప్రచారం ముందుకు సాగుతోంది. అడ్డతీగల గ్రామంలోని మహిళలు హారుతిచ్చి విజయసంకేతంగా రామారావుకు తిలకం దిద్దారు. ఆ తరువాత అడ్డతీగల ప్రధాన రహదారిలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి తన ప్రచారంలో భాగంగా ర్యాలీకి వెళుతూ అంబేద్కర్‌ కి జోహార్‌ నినాదాలు ఇచ్చారు. ఏజెన్సీ ప్రజలు అభి వృద్ధికి నోచుకోవాలంటే సిపిఎం పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని, అసెంబ్లీలో గొంతు ఎత్తి మాట్లాడే నాయకుడిని పంపించాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు కూడా సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటు వేయాలని తెలిపారు.

➡️