ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో:బిజెపి ఎంపి, నటి నవనీత్ కౌర్పై షాద్ నగర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మహబూబ్నగర్ నియోజకవర్గం బిజెపి అభ్యర్ధి డికె అరుణకు మద్దతుగా షాద్నగర్లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ కాంగ్రెస్కు ఓటేస్తే పాకిస్తాన్కు వేసినట్లేనని నవనీత్ కౌర్ వ్యాఖ్యానించారు. వీటిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. నవనీత్ కౌర్ వ్యాఖ్యలను ఇసి కూడా సీరియస్గా తీసుకోవడంతో షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.