న్యూఢిల్లీ : స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ఎపి ప్రభుత్వ పిటిషన్పై సుప్రీం కోర్టులో సోమవారం జరిగిన విచారణ మరోసారి వాయిదా పడింది. మూడు వారాల తర్వాత పిటిషన్పై విచారణ చేపడతామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం పేర్కొంది.