- సిఎం జగన్కు రఘువీరా సూటిప్రశ్న
ప్రజాశక్తి-మడకశిర : ఐదేళ్లలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏం సాధించారని సిఎం జగన్ రాప్తాడులో సిద్ధం సభ నిర్వహిస్తున్నారని సిడబ్ల్యుసి మెంబర్ రఘువీరారెడ్డి సూటిగా ప్రశ్నించారు. పట్టణంలోని నీలకంఠ కోల్డ్ స్టోరేజ్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు జిల్లాలో రైతులు, రైతు కూలీలను ఆదుకోవడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్టు అనంత’ పేరుతో రూ. 7,760 కోట్లు మంజూరు చేసిందని, అయితే గత ప్రభుత్వం పూర్తి చేయలేదు మీరు ఆ పని చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. రాయదుర్గం ప్రాంతంలో కుదిరేముఖ్ ఖనిజ పరిశ్రమ, మడకశిర, కళ్యాణదుర్గం, కదిరి ప్రాంతాల్లో ఎపిఐసిసి భూముల్లో పరిశ్రమలు నిర్మించడానికి మీరు సిద్ధమా అన్నారు. ఐదేళ్లలో ఏ ఒక్క కార్యక్రమం చేపట్టని మీరు సిద్ధం సభకు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. ఆయా పనులన్నీ పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు సుధాకర్, గౌడప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.