షర్మిల అరెస్టును ఖండించిన సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ

విజయవాడ : ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న పిసిసిఐ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలని అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈమేరకు గురువారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించాలని కోరుతూ … ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న పిసిసిఐ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలని అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నదన్నారు. నిరసన తెలియజేయడానికి ఛలో విజయవాడకు కార్యకర్తలు రాకుండా ముందస్తు అరెస్టులు చేయడమనేది నిరంకుశ వైసిపి ప్రభుత్వపు నైజాన్ని వెల్లడిచేస్తున్నదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీని ప్రకటించి నిరుద్యోగులకు ఊరట కలిగించాలని సిపిఐ(యం) కోరుతున్నదన్నారు.

➡️