విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం విస్తృత ప్రచారాన్ని చేపట్టింది. గురువారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, కే.శ్రీదేవి, సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మధురానగర్ ఏరియాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.