ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ :ఇండియా కూటమి తరపున పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థిగా పోటీచేస్తున్న డి.గౌస్ దేశాయ్ శుక్రవారంనాడు తన ఎన్నికల ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. కర్నూలు నగరంలోని కల్లూరులోని పలు ప్రాంతాల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ పాలనలో ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఇంటింటికి తిరిగి సిపిఎం ముద్రించిన కరపత్రాలను పంచుతూ ప్రచారాన్ని నిర్వహించారు. గౌస్దేశాయ్ మాట్లాడుతూ కర్నూలు నగర ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. తాగునీరు, డ్రెయినేజీలు, రోడ్లు వంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి ఎం.రాజశేఖర్, నాయకులు రమణమూర్తి, నాగరాజు, సుధాకర్, అప్ప గోవిందు, వెంకటరాముడు, శీను, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.