మంగళగిరి రూరల్ (గుంటూరు) : మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో సిపిఎం అభ్యర్థి జొన్నా శివ శంకరరావు శుక్రవారం ఉదయం విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. మంగళగిరిలో తిరిగి ప్రజల పక్షాన నిలబడే కమ్యూనిస్టులను గెలిపించి చరిత్రను తిరగరాయలని పిలుపునిచ్చారు. కొండమీద గ్రాఫిక్స్ చూపుతున్న లోకేష్ ను, కుటుంబ అభివృద్ధి తప్ప ప్రజల సంక్షేమం పటని మురుగుడు కుటుంబ అభ్యర్థిని ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి జొన్న శివశంకర్ తో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, నాయకులు వెంకటరెడ్డి, మొసలి పకిరయ్య, బూరగ వెంకటేశ్వర్లు, యు.దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.