ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : జాతీయస్థాయి సర్ సివి.రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పుట్లూరు మండల విద్యార్థి మిధునను పలువురు శనివారం అభినందించారు. జాతీయ స్థాయిలో మొదటి స్థానం, రాష్ట్ర స్థాయిలో నాలుగవ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి ఒలంపియాడ్ యంగ్ జీనియస్ అవార్డును పొందిన పుట్లూరు వార్త రిపోర్టర్ బైరవేశ్వరరెడ్డి కుమార్తె ‘ మిధున’ అవార్డును గెలుచుకోవడంతో పలువురు అభినందించారు.