ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో పోలింగ్ తర్వాత పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవాహర్రెడ్డి, రాష్ట్ర డీజీపీ హారీశ్కుమార్ గుప్తాకు సమన్లు జారీ చేసింది. దీంతో సచివాలయంలో సీఎస్ జవాహర్రెడ్డితో డీజీపీ హారీష్కుమార్ గుప్తా బుధవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డీజీపీతో పాటు ఇంటలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజీత్ కూడా పాల్గొన్నారు. సీఎస్, డీజీపీ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/ap-cs.jpg)