జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అరెస్టు చేయాలంటూ … హైవేపై ధర్నా

తాడిపత్రి (అనంతపురం) : వైఎస్సార్‌ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు భాస్కర్‌ పై దాడి చేసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ … తాడిపత్రి-గుత్తి హైవేపై చుక్కలూరు పంచాయతీ ఎంపిటిసి ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. నేషనల్‌ హైవే-67 పై బాధితుడు భాస్కర్‌, ఎంపిటిసి మేరీ బైఠాయించారు. ఎంపిటిసి మేరీ మాట్లాడుతూ … తాడిపత్రి మండలం పరిధిలోని చుక్కలూరు గ్రామం వద్ద వైఎస్సార్‌ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు భాస్కర్‌ పై జేసీ ప్రభాకర్‌ రెడ్డి దాడి చేసినట్లు తెలిపారు. దళితులపై దాడి చేసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై కేసు నమోదు చేసేంతవరకు ధర్నా విరమించబోమని స్పష్టం చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

➡️