ప్రజాశక్తి-సోమల: చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె గ్రామంలో ఆదివారం నిర్వహించాల్సిన పశువుల పండుగ( జల్లికట్టు) అనుమతులు లేని కారణంగా నిర్వహించరాదని పోలీసులు తేల్చి చెప్పడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం రాత్రి పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేక పోలీసు బెటాలియన్ గ్రామానికి చేరుకుని బందోబస్తు నిర్వహించనున్నట్లు సమాచారం.