ప్రజాశక్తి-ఒంగోలు : లంచం తీసుకుంటూ ఏసీబీకి జిల్లా మలేరియా అధికారి చిక్కిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మలేరియా అధికారి జ్ఞాన శ్రీ తోటి ఉద్యోగుల సహాయంతో 1,40,000/- లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంరతం జిల్లా కేంద్రంలోని పాత రిమ్స్ కార్యాలయంలోని మలేరియా జిల్లా కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.