- మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కడప కోర్టు
ప్రజాశక్తి – కడప : ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య గురించి ఎవ్వరూ మాట్లాడకూడదని కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కడప ప్రిన్సిపల్ డిస్టిక్ కోర్టులో మాజీ గవర్నమెంట్ ప్లీడర్ ఎం.నాగిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో వివేకానందరెడ్డి హత్య గురించి చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, పురందేశ్వరి, బీటెక్ రవి, వైఎస్.షర్మిల, వైఎస్.సునీత మాట్లాడకూడదని ప్రిన్సిపల్ జిల్లా కోర్టు జడ్జి గురువారం ఆదేశించారు.