జనగాం ఏసీపీపై ఈసీ వేటు

హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ నిబంధనలు ఉల్లంగించి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జనగాం ఏసీపీ దామోదర్‌ రెడ్డి మీద ఈసీ వేటు వేసింది. ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉండగా ఏసీపీ దామోదర్‌ రెడ్డి ఈనెల 23న కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవంలో ఎన్నికల కోడ్‌ నిబంధనలు ఉల్లంగించి పాల్గొన్నారని ఎన్నికల సంఘానికి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కంప్లైంట్‌పై విచారణ జరిపిన అనంతరం ఏసీపీ దామోదర్‌ రెడ్డినీ డీజీపీ ఆఫీస్‌కి అటాచ్‌ చేస్తూ ఈసీ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

➡️