తెలంగాణ : ఎలక్షన్ కోడ్ అమలవుతోన్న వేళ … తెలంగాణలో రూ.49 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులను అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 466 ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ (ఎఫ్ఎస్ఈ) ఆధ్వర్యంలోనే కాకుండా 85 అంతర్ రాష్ట్ర సరిహద్దు చెకోపోస్టుల్లోనూ సోదాలను కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. వీటిల్లో రూ.41.07 కోట్లను పోలీసులు పట్టుకోగా రూ.7.9 కోట్లను ఎఫ్ఎస్ఈ, స్టాటిస్టికల్ సర్వైలెన్స్ టీంలు సీజ్ చేశాయి.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/cash-1.jpg)