జనసేనలోకి మాజీ మంత్రి కూతురు..? రాజోలు టికెట్‌ పై ఆశలు

Feb 23,2024 13:44 #Hopes, #JanaSena, #Tickets

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : రాజోలులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఆశావాహుల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. దీంతో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు కుమార్తె గొల్లపల్లి అమూల్యకు రాజోలు జనసేన టికెట్‌ కేటాయిస్తే గెలుపు సునాయాసం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈమె పోటీలో ఉంటే టిడిపి ఓటు బ్యాంక్‌ చెక్కు చెదరకుండా ఆమెకే ఉంటుందని పలువురు సీనియర్‌ టిడిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. అమూల్య భర్త బిసి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ వర్గం నుండి మెజారీటి ఓట్లు తెచ్చుకుంటుందన్న ధీమా జనసేనకు క్షేత్రస్థాయిలో ఉంది. ఈమె త్వరలో జనసేన అధినాయకుడు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తుంది.

➡️