మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి కన్నుమూత..

Jan 29,2024 14:36 #Congress

హైదరాబాద్‌ : పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో వైట్‌ హౌస్‌ లో ఆయన నివాసముంటున్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సీఎం రేవంత్‌ సంతాపంర్సారెడ్డి మతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా ఆయన సేవలందించారని కొనియాడారు. ఆయన మతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఆయన మతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా 1972 నుంచి రెండేళ్ల పాటు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఆయన పని చేశారు. జలగం వెంగళరావు మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు.

➡️