హైదరాబాద్: ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం అద్దె బస్సుల ఓనర్లు మీడియాతో మాట్లాడారు. ‘ఉచిత ప్రయాణంతో మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగింది. రద్దీ పెరిగితే బస్సులు పాడవుతున్నాయి. ప్రమాదానికి ఇన్సురెన్స్ రాకపోతే మాపై కేసులు పెడుతున్నారు. కొత్త బస్సులకు టెండర్లు పిలిస్తే కూడా ఎవరూ టెండర్లు వేయలేదు. టెండర్లు వేయొద్దని కోరుతున్నాం’ అని అన్నారు.