విశాఖలో మత్తు ఇంజక్షన్లు స్వాధీనం

  •  భార్యభర్తలు అరెస్టు

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖ నగరంలోని ఎంవిపి పోలీసు స్టేషన్‌ పరిధిలో భారీగా మత్తు ఇంజక్షన్లను టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది మంగళవారం సీజ్‌ చేశారు. ఒడిశా రాష్ట్రంలోని కొరాఫుట్‌ నుంచి ఈ మత్తు ఇంజక్షన్లను తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో విశాఖలోని టాస్క్‌ఫోర్సు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మద్దిలపాలెం బస్సు డిపోలో భార్యాభర్తలను అరెస్టు చేశారు. వారి వద్ద 580 మత్తు ఇంజక్షన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎంవిపి పోలీసులకు అప్పగించారు. వీటిని ఒడిశా నుంచి విశాఖ మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

➡️