ఐపీఎల్‌ బెట్టింగ్‌.. బీటెక్‌ స్టూడెంట్‌ ఆత్మహత్య

Apr 28,2024 11:13 #ipl 2024, #suside, #Telangana

హైదరాబాద్‌: ఐపీఎల్‌ బెట్టింగ్‌ ఓ బీటెక్‌ స్టూడెంట్‌ ప్రాణం తీసింది. లక్షలకు లక్షలు బెట్టింగ్‌ పెట్టి అవి పోవడంతో శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట సీఐ మహేశ్‌గౌడ్‌ కథనం ప్రకారం పట్టణంలోని గొల్లకేరికి చెందిన చింత ఆదర్శకుమార్‌ కొడుకు వినీత్‌(23) కొంతకాలంగా క్రికెట్‌ బెట్టింగ్‌, జూదానికి అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో తెలిసిన మిత్రులు, యాప్‌ల ద్వారా అప్పులు తీసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో చేసేదేంలేక, ఇంట్లో చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

➡️