మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి మెయిన్ బజార్ వస్త్ర వ్యాపార వేత్త నివాసంలో ఐటి అధికారులు చేపట్టిన సోదాలు శుక్రవారం కొనసాగుతున్నాయి. నిన్న తెల్లవారుజాము నుండి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. వ్యాపారవేత్త నివాసంలోనివారిని బయటకు రానీయకుండా అధికారులు విచారిస్తున్నారు. అనధికారికంగా కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారంతో సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది. సుమారు పది కోట్ల రూపాయల వరకు నగదు, రూ.25 కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు, ఎఫ్డీ లు ఉండొచ్చని అంచనా. భారీ మొత్తంలో ఉన్న డబ్బు రాజకీయ పార్టీకి సంబంధించి ఎన్నికల కోసం ఉన్న నగదా ? లేక చిట్స్ వ్యాపారానికి సంబంధించిన డబ్బా ? అనే దానిపై ఐటి అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ నగదు అధికార పార్టీ నాయకుడికి చెందినదా ? అనే దానిపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇంత నగదు ఇంట్లో ఉండటం ప్రజల్లో తీవ్ర చర్చాంనీయాంశంగా మారింది.