Kagaznagar: నలుగురు మహిళలు ఆత్మహత్యాయత్నం

Jul 1,2024 19:54 #suside, #Telangana

హైదరాబాద్‌ : కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం గజ్జెడలో నలుగురు మహిళలు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీ ముగ్గురు కుమార్తెలు పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️