యుటిఎఫ్ పల్నాడు జిల్లా కార్యాలయం భవన నిర్మాణ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్మించ తలపెట్టిన యుటిఎఫ్ జిల్లా కార్యాలయ భవన నిర్మాణాన్ని ఇటుక, ఇసుక, సిమెంట్ భవనంలా భావించవద్దని ఉద్యమ కేంద్రంగా భావించాలని ఎమ్మెల్సీ కె.ఎస్ లక్షణరావు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పల్నాడు రోడ్డులోని ఎస్.ఎస్.ఎన్ కళశాల ఆడిటోరియంలో యుటిఎఫ్ పల్నాడు జిల్లా కార్యాలయ భవన నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. సమావేశంలో యుటిఎఫ్ పల్నాడు జిల్లా కమిటీతో పాటు యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.