నేడు గాంధీభవన్‌లో టీ కాంగ్రెస్‌ మేనిఫెస్టో..

May 3,2024 12:15 #Congress Manifesto, #Telangana

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను టీపీసీసీ శుక్రవారం విడుదల చేయనుంది. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి ఈ ‘తెలంగాణ మేనిఫెస్టో’ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్‌ మున్షీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తదితరులు పాల్గంటారు. వాస్తవానికి గత నెల 6వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలోనే తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయాలని టీపీసీసీ నేతలు భావించారు. ఇది 23 కంటే ఎక్కువ హామీలతో తయారు చేయబడింది.
కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, రైల్వే లైన్లు ప్రారంభిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇస్తుంది. రామగుండం, మణుగూరు రైల్వే లైన్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రైలు కనెక్టివిటీని పెంచుతామని పేర్కొన్నారు. అంతేకాకుండా, నీతి ఆయోగ్‌ ప్రాంతీయ కార్యాలయం, 4 కొత్త సైనిక్‌ పాఠశాలలు, కేంద్రీయ విశ్వ విద్యాలయాల విస్తరణ, నవోదయ విద్యాలయాల రెట్టింపు, జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌, నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ, ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ హైదరాబాద్‌. 73వ, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఐసిఎంఆర్‌ క్యాంపస్‌ పరిధిలోని అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు అందజేస్తామని ప్రకటించారు.
హైదరాబాద్‌లోని కొత్త డ్రై ఫోర్ట్‌లో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ కల్చరల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌, మేడారం జాతరకు జాతీయ హౌదా, సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇక భద్రాచలం ముంపు మండలాలైన ఎటపాక, గుండాల, పురోషోత్తం పట్నం, కన్నాయి గూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇస్తుంది. కేంద్రం వచ్చాక ఈ పనులు చేస్తామని ప్రజలకు చెబుతామన్నారు. అంతేకాదు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇస్తామని కాంగ్రెస్‌ ప్రత్యేక వాగ్దానాలు చేస్తుంది. మరోవైపు హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌, కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఏపీ పునర్‌వ్యవస్థీకరణలో భయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), హైదరాబాద్‌లో ర్యాపిడ్‌ రైల్వే సిస్టమ్‌, విజయవాడ హైవే, మైనింగ్‌ యూనివర్సిటీలను వెల్లడించనున్నారు.

➡️