ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్ : నంద్యాల పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు..పట్టణంలోని దేవనగర్ కాలనీకి చెందిన సమీర్ (25) తన ఇంటి మేడపైన ఆదివారం రాత్రి నిద్రించారు. సమీర్ను నిద్ర లేపేందుకు సోమవారం ఉదయం మేడపైకి కుటుంబసభ్యులు వెళ్లారు. రక్తపుమడుగులో సమీర్ పడి ఉండటాన్ని కుటుంబసభ్యులు గమనించి వెంటనే మూడవ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గొంతుకోసి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వ్యక్తిగత కారణాలతో హత్య చేశారా? లేక వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.