ప్రజాశక్తి- అనంతపురం క్రైం : అనంతపురం రేంజ్ డిఐజి అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం కొరాఠా ఝుళిపించింది. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఆయన విధుల నుంచి రిలీవ్ కావాలని, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. అధికార పార్టీకి డిఐజి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు గత కొంతకాలంగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్నికల కమిషన్కు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేయడంతో ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.