తెలంగాణ : ఎపి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆదివారం హైదరాబాద్ మాదాపూర్లోని తన నివాసంలో ఉన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని శనివారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈరోజు హైదరాబాద్లోనే ఆయన ఉండి తెలంగాణ జనసేన నేతలతో పవన్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోమవరం సొంత నియోజకవర్గం పిఠాపురానికి వెళ్ళనున్నారు. సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/pawan-kalyan-7.jpg)