లిక్కర్‌ స్కాం కేసులో రామచంద్ర పిళ్లైకి బెయిల్‌

హైదరాబాద్‌ : ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో నిందితుడు, వ్యాపారవేత్త అరుణ్‌ రామచంద్ర పిళ్లైకి కోర్టు బెయిల్‌ ఇచ్చింది. భార్య అనారోగ్యంతో ఉందంటూ బెయిల్‌ కోసం పిళ్లై దరఖాస్తు చేసుకున్న పిటిషన్‌పై సానుకూలంగా స్పందించింది. ఆసుపత్రిలో చేరిన భార్యను దగ్గరుండి చూసుకోవడం కోసం రెండు వారాలు బెయిల్‌ మంజూరు చేస్తూ రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్‌ రామచంద్ర పిళ్లైని.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన అప్రూవర్‌ గా మారారు. పిళ్లై వెల్లడించిన వివరాలతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగాయి.

➡️