రేవణ్ణను కఠినంగా శిక్షించాలి : ఐద్వా రాష్ట్ర కమిటీ

Apr 29,2024 21:42 #aidwa, #jdsu leader, #revanna

ప్రజాశక్తి-అమరావతి: జెడిఎస్‌ నేత, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై తక్షణమే విచారణ చేపట్టిన కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి డిమాండ్‌ చేశారు. మహిళలను లైంగికంగా వేధించడంతో పాటు అసభ్యకరమైన వీడియోలతో బ్లాక్‌ మెయిల్‌ చేసినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయని, దీనిపై కర్ణాటక ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇంతలోనే రేవణ్ణ దేశం వదిలి పారిపోయాడన్నారు. అతన్ని వెంటనే రప్పించి, త్వరితగతిన విచారించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ మహిళా కమిషన్‌ ఈ ఘోర దురంతంపై స్పందించకపోవటాన్ని ఖండించారు.

➡️