శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 25 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. మంగళవారం 73,016 మంది యాత్రికులు దర్శించుకోగా 20,915 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు వచ్చిందని వివరించారు.

➡️