వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీ : వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ వైఎస్‌ సునీత వేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏప్రిల్‌ 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో వాదలను వింటామని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం తెలిపింది. ఏప్రిల్‌ 22లోపు వాదనలు వినడం కుదరదని చెప్పింది. ఆలోగా కేసు డైరీ వివరాలను తమ ముందు ఉంచాలని సీబీఐని ఆదేశించింది. కేసు డైరీ మొత్తాన్ని డిజిటలైజ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

➡️