ప్రజాశక్తి-బి.కొత్తకోట (అన్నమయ్య) : బి.కొత్తకోట జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్.తమన్నా నేడు వెలువడిన పదో తరగతి పరీక్షల్లో మండల మొదటి ర్యాంక్ సాధించినట్లు మండల విద్యాశాఖ అధికారి రెడ్డి శేఖర్ తెలిపారు. తమన్నా 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచినట్లు విద్యాశాఖ అధికారి ఎంఈఓ రెడ్డి శేఖర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల ఎంత అభివఅద్ధి చెందిందో అనడానికి ఇది నిదర్శనమని ఆయన తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/ranks.jpg)