సంగం (నెల్లూరు) : ఉపాధ్యాయ సమస్యలపై పోరాడిన వ్యక్తి, ఎమ్మెల్యే విక్రం రెడ్డి పిఎ గాజుల ఫరూక్ అలి సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈరోజు ఉదయం సంగం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉదయగిరి పట్టణానికి చెందిన షేక్.గాజుల ఫారూఖ్ అలీ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు ఉదయగిరి మండలం కృష్ణంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. మేకపాటి కుటుంబానికి అత్యంత ఆప్తుడు గా, ఎమ్మెల్యే విక్రం రెడ్డికి పిఏ గా ఫరూక్ అలీ ఉంటున్నారు. ఫరూక్ అలీ మరణవార్త తెలిసిన టీచర్లందరూ సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. టీచర్స్ గ్రూప్ లో అందరూ అభిమానించే వ్యక్తి, ప్రభుత్వ అధికారులతో మాట్లాడి టీచర్స్ సమస్యలపై పోరాడే యోధునిగా అలీ పేరు తెచ్చుకున్నారనీ, ఆయన మరణం తీరని లోటు అని ఉపాధ్యాయ గ్రూపుల్లో సంతాపం తెలియజేస్తున్నారు.