తెలంగాణ : ఎండల తీవ్రత పెరుగుతోన్న వేళ … తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే స్కూళ్లకు ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. అయితే ఇంటర్ కళాశాలలకు శనివారం నుంచి నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది. మళ్లీ జూన్ 1వ తేదీన కళాశాలలు పున్ణప్రారంభం అవుతాయని తెలిపింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/colleges.jpg)