IMD : తెలుగు రాష్ట్రాలో రానున్న 4 రోజులపాటు మోస్తరు వానలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. మంగళవారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గడంతో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందారు. ఎపిలో కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది.