తెలంగాణ : ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రూస్ అరెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు ఈడీ అధికారులు హాజరుపరిచారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న ఆమె నివాసంలో కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి రాత్రి ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. అక్కడి ప్రత్యేక సెల్ లో ఆమెను ఉంచారు. శనివారం ఉదయం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపటి క్రితం ఆమెను ఢిల్లీలోని రూస్ అరెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశ పెట్టారు. కవితను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఈడీ అధికారులు కోరుతున్నారు. కవితపై మనీ లాండరింగ్ సెక్షన్ల కింద ఈడీ అభియోగాలు మోపింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.