దూసుకుపోతున్న టిడిపి కూటమి – 100కు పైగా సీట్లలో ముందంజ

Jun 4,2024 10:33 #leading, #TDP alliance

అమరావతి : ఎపి ఎన్నికల ఫలితాల్లో టిడిపి కూటమి దూసుకుపోతోంది. 100కు పైగా సీట్లలో టిడిపి ఆధిక్యంలో ఉంటే.. జనసేన 21 సీట్లలో, బిజెపి ఐదు స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. అటు అధికార వైసిపి వెనుకంజలో ఉంది. కేవలం 20 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. ప్రస్తుతం టిడిపి సింగిల్‌గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ దిశగా జోరందుకుంది. రాజమండ్రి రూరల్‌లో టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 25 వేలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. వైసిపి నుంచి టిడిపిలోకి వచ్చిన గుమ్మనూరి జయరామ్‌ గుంతకల్లులో 600 ఓట్ల ముందంజలో ఉన్నారు. పిఠాపురంలో జనసేనాని ఆధిక్యం 10 వేలు దాటింది. కుప్పంలో చంద్రబాబు 5 వేలకుపైగా ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేశ్‌ రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి 8 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

➡️