తిరుమలలో విస్తృత ఏర్పాట్లు : ఈఒ

ప్రజాశక్తి -తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సందర్శకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని, అందుకు తగ్గట్టు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోందని ఈవో ఎవి ధర్మారెడ్డి పునరుద్ఘాటించారు. డయల్‌ యువర్‌ ఇఒ కార్యక్రమం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్‌ నెలలో 20.17 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. రూ. 101.63 కోట్లు హుండీ ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని చెప్పారు. 94.22 లక్షలు లడ్డూలు విక్రయించామని తెలిపారు. 39.73 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారని, 8.08 లక్షల మంది తలనీలాలు సమర్పించారని చెప్పారు.

➡️