రాత్రి వివాహం.. తెల్లారేసరికి విషాదం

Mar 30,2024 21:40 #Manyam District, #women death

ప్రజాశక్తి -మక్కువ (పార్వతీపురం మన్యం జిల్లా) :కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు మృతి చెందిన విషాద సంఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్కువ మండలం దబ్బగెడ్డ పంచాయతీకి చెందిన వారణాసి భాస్కరరావుకు పార్వతీపురం మండలం కొత్తవలసకు చెందిన అఖిల (20)తో శుక్రవారం రాత్రి వైభవంగా వివాహం జరిగింది. ఇంతలో ఏమైందోగానీ శనివారం ఉదయం అఖిల తనకు నీరసంగా ఉందని చెప్పి ఒక్కసారిగా అపస్మారస్థితికి చేరుకుంది. కుంటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో సాలూరు ఏరియా ఆస్పపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి అఖిల మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️