210 హైస్కూళ్ల అప్‌గ్రేడ్‌

Feb 21,2024 08:46 #210, #High Schools, #Upgradation

జూనియర్‌ కళాశాలలుగా మార్పు అమరావతి బ్యూరో:రాష్ట్రంలో 210 హైస్కూళ్లను అప్‌గ్రేడ్‌ చేశారు. వాటిని జూనియర్‌ కళాశాలలుగా మార్పు చేస్తూ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. వీటిల్లో 207 కో-ఎడ్యుకేషన్‌ కాగా, మూడు పూర్తిగా విద్యార్థినుల కోసం కేటాయించారు. నూతనంగా ఏర్పాటుచేసే కళాశాలల్లో ఎంపిసి, బైపిసి, సిఇసి గ్రూపులను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి తరగతిలోనూ 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుండి ఈ మార్పు అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రతి మండలంలో జూనియర్‌ కళాశాల ఉండాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాల ప్రకారం ప్రతి మండలంలోనూ రెండు జూనియర్‌ కళాశాలలు ఏర్పాటుకానున్నాయి. వీటిల్లో ఒకటి కో-ఎడ్యుకేషన్‌, మరొకటి బాలికలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.

➡️